21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి విజయం ఒకే ఒక్క వార్డుకు పరిమితమైన బిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కూటమి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని పట్టుబట్టి ఒకవైపు పార్టీ శ్రేణులను కదిలించారు, పోరాట స్ఫూర్తిని నింపారు. మరోవైపు రాబోయే 50 సంవత్సరాలకు సరిపడా మధిర అభివృద్ధికి చేస్తున్న కృషిని ఓటర్లకు తానే స్వయంగా వివరించి వారి మనసు గెలిచి ఘన విజయం సాధించారు.

