నగర శివార్లలోని గండిపేట్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు గతవారం రోజులుగా చుక్కలు చూపిస్తున్న చిరుత గోల్కొండ ఆర్మీ పరిధిలోని ఇబ్రహీంబాగ్లో ప్రత్యక్షమయ్యింది. లంగర్హౌజ్నార్సింగి ప్రధాన రహదారిలో ఆర్మీ సెంటర్ సమీపంలో ఆదివారం రాత్రి చిరుతపులి రోడ్డు దాటుతుండగా గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించగా, సిసి కెమెరాలను పరిశీలించి నిర్థారణ చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలప్రజలను అప్రమత్తం చేశారు.

