
ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్కు లేఖలు రాశామని, ఈ అంశంపై కేంద్ర మంత్రితో నేరుగా మాట్లాడి ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరినట్లు వివరించారు.