తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. హుజురాబాద్లో ఓటమిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఈటెల కౌంటర్ ఇచ్చారు.ఇకపై స్ట్రెయిట్ ఫైట్ ఉంటుందని, అవమానాలను ఎదుర్కొనే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు.కడుపులో కత్తులు పెట్టుకున్న వారితో పోరాడలమేన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని, తనకు తెలియని వారే లేరన్నారు. వీరుడు ఎక్కడా భయపడడని.. రాజకీయాల్లో కొంతమంది ఉంటారని, ఇతరులను ఎదగనివ్వకుండా చేయడమే వాళ్ల పని అంటూ విమర్శించారు.

