తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలు తుంగ లోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు, డ్రెక్టర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి తరలించుకుపోతున్నారు కొందరు వ్యాపారులు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చూసిచూడనట్టు వదిలేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇసుక అక్రమరావాణపై అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

