ముంబైలో అబ్దుల్లా డొకాడియా బంధువులతో కలిసి బిర్యానీతో విందు ఆరగించారు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఆ కుటుంబ సభ్యులు పుచ్చకాయ తిన్నారు. అయితే తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వాంతులు,
విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి విషమించింది. జేజే ఆసుపత్రికి వారిని తరలించారు. అయితే చికిత్స పొందుతూ భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమార్తెలు 16 ఏళ్ల ఆయేషా, 13 ఏళ్ల జైనాబ్ మరణించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

