కర్ణాటక రాయచూర్ జిల్లా శక్తినగర్ చెందిన తాతప్ప, అతని భార్య ఇద్దరు మోటర్ బైక్ మీద.. తెలంగాణలోని నారయణ పేట జిల్లాకు వస్తున్నారు. కడ్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జి వద్దకు రాగానే ఇద్దరం సెల్పీలు దిగుదామని భార్య ఒక్కసారిగా భర్తను గట్టిగా నదిలోకి తోసేసింది. అతను కొద్దిదూరం కొట్టుకుని పోయాడు. కొంత మంది సాయంతో బ్రిడ్జి మీదకు వచ్చాడు. ఆ తర్వాత తన భార్య తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆమెతో గొడవకు దిగాడు.

