తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన వారిని ఎండగట్టడంలో రాష్ట్ర ఎంపీలు విఫలమయ్యారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోలుస్తూ అవమానకర వ్యాఖ్యలు చేస్తే, రాష్ట్రానికి చెందిన 16 మంది ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? వీరికి పౌరుషం లేదా?
అదే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ సభలో ఉన్నా రణరంగం చేసి, సదరు ఎంపీతో క్షమాపణ చెప్పించేవాళ్లం అని కేసీఆర్ స్పష్టం చేశారు

