గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ దేశాలమధ్య యుద్ధం మరింత ఉద్రిక్తలమధ్య కొనసాగేలా ఉంది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఐరోపా నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు పందిపిల్లలు అంటూ ఎద్దేవా చేశారు. రష్యా ఏదోఒకరోజు నాటో కూటమి దేశాలపై కూడా దాడి చేస్తుందనే అనవసర భయాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

