సోషల్ మీడియాలో తన పేరు అడ్డంపెట్టుకుని జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. ‘‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’’ పేరుతో అశ్విన్ అట్లూరి అనే విరాళాలు సేకరిస్తున్నట్టుగా తెలిసిందని.. అయితే ఆ ఈవెంట్కు తన అనుమతి లేదని తెలిపారు. బసవతారకం ఆస్పత్రి ట్రస్టు బోర్డు నుంచి ఎటువంటి అధికారిక ఆమోదం లేదని చెప్పారు. ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన అభిమానులను, ప్రజలను కోరారు.

