ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది.ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి ముందుకు వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ‘విజన్ 2047’ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార పార్టీ తరపున ఎవరు మాట్లాడాలో నిర్ణయించే సమయంలో వారణాసి బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవతో మథుర బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ చౌదరి తీవ్ర వాగ్వాదానికి దిగారు.

