ప్రపంచవ్యాప్తంగా మందగమనం నెలకొన్న వేళ భారతదేశం ఆర్థికాభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన 8.2% వృద్ధి ప్రపంచానికి మనమే చోదక శక్తి అని నిరూపిస్తోందన్నారు. భారత్ తనదైన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని లీడర్షిప్ సమ్మిట్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3%,సగటు వృద్ధిని నమోదు చేస్తున్న సమయంలో భారత్ తనదైన రీతిలో దూసుకెళుతోందని మోదీ పేర్కొన్నారు.