భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సెలెక్షన్ కమిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన అజిత్ అగార్కర్ బృందానికి BCCI మరోసారి పట్టం కట్టనుంది. ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం అగార్కర్ పదవీకాలం 2026 జూన్తో ముగియాల్సి ఉంది. అయితే, వచ్చే ఏడాది జరగనున్న 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ వరకు ఆయనే చీఫ్ సెలెక్టర్గా కొనసాగాలని బోర్డు మొగ్గు చూపుతోంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన, సుదీర్ఘ కాలం కొనసాగిన చీఫ్ సెలెక్టర్లలో ఒకరిగా అగార్కర్ నిలుస్తారు.

