అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తంగా 265 మంది మృతి చెందగా.. ప్రమాదంలో చనిపోయిన వారందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలోకి మారిపోగా.. డీఎన్ఏ టెస్టులు చేసి మరీ వారిని గుర్తించబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు సివిల్ ఆస్పత్రి ఎదుట క్యూ కట్టారు. ఓవైపు శాంపిల్స్ ఇస్తూనే.. మరోవైపు మృతదేహాలను తమకు ఎప్పుడు అప్పగిస్తారంటూ అడుగుతురున్నారు.

