కశ్మీర్పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వాగుడు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి కశ్మీర్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత వ్యతిరేక శక్తులకు బహిరంగంగా మద్దతు ఇచ్చేలా మాట్లాడారు. మరణించిన ఉగ్రవాదులను అమరవీరులు అని ఆయన అభివర్ణించారు. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను చట్టబద్ధమైన పోరాటం అని పేర్కొన్నారు. ఈ కార్యకలాపాలకు రాజకీయ, నైతిక, దౌత్యపరమైన మద్దతను పాకిస్థాన్ అందిస్తుందని తెలిపారు.

