loader

క్షణాల్లో బస్సు దహనం.. 71 మంది మృతి!

అఫ్గానిస్థాన్‌లో బస్సు ఆకస్మికంగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 17 మంది చిన్నారులతో సహా మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఇరాన్‌ నుంచి బహిష్కరణకు గురైన అఫ్గాన్‌ వలసదారులు బస్సులో స్వగ్రామాలకు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మోటార్ సైకిల్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాప్తించగా.. ప్రయాణికులు బయటపడే అవకాశం లేకుండా పోయింది.

బ్రిటన్‌లో సిక్కులపై జాత్యాహంకార దాడి.. ఇద్దరు వ్యక్తులను కొట్టిన టీనేజర్లు

వోల్వర్‌హాంప్టన్‌లో చోటుచేసుకున్న ఒక దారుణమైన జాత్యహంకార దాడి బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక రైల్వే స్టేషన్ బయట.. ముగ్గురు టీనేజర్లు ఇద్దరు సిక్కు పురుషులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి పవిత్రమైన తలపాగాలను బలవంతంగా తొలగించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో.. ఈ అమానవీయ చర్యపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

పుతిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే : జెలెన్‌స్కీ

పుతిన్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు జెలెన్‌స్కీ సిద్ధంగా ఉన్నారు. ట్రంప్‌తో భేటీ త‌ర్వాత‌.. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని ఆశిస్తున్న‌ట్లు జెలెన్‌స్కీ తెలిపారు. త్రైపాక్షిక మీటింగ్‌కు కూడా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వెల్ల‌డించాడు. ఒక‌వేళ ద్వైపాక్ష‌క చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్‌తో చెబితే, దానికి కూడా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు జెలెన్‌స్కీ తెలిపాడు. శాంతి స్థాప‌న కోసం ఉక్రెయిన్ ఎప్ప‌టికీ వెనుక‌డుగు వేయ‌ద‌ని ఆయ‌న అన్నారు.

6వేలకి పైగా వీసాలు రద్దు

అమెరికా ప్రభుత్వం 6,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం, దాదాపు 4,000 వీసాలు చట్ట ఉల్లంఘనల కారణంగా రద్దయ్యాయి. వీటిలో డ్రంక్ అండ్ డ్రైవ్, దొంగతనం, చిన్న నేరాలు ఉన్నాయి. ఇంకా 200–300 వీసాలను టెర్రరిస్ట్ గ్రూపులకు మద్దతు ఇచ్చారన్న కారణంతో రద్దు చేశారు.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ప్రతి సంవత్సరం ఆగస్టు 19న, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం చిత్రాల వెనుక ఉన్న కళ, విజ్ఞానం మరియు చరిత్రను జరుపుకుంటుంది . 1837లో అభివృద్ధి చేయబడిన ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ అయిన డాగ్యురోటైప్ ఆవిష్కరణను జ్ఞాపకార్థం 1991లో ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా గుర్తించారు. అప్పటి నుండి, ఫోటోలు అభివృద్ధి చెందాయి.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

అమెరికా, ఇజ్రాయెల్‌ తో ఎప్పుడు అయినా యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన యాహ్యా రహీమ్ సఫావీ తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ”మేము శాంతి ఒప్పందాల్లో లేము. యుద్ధానికి సిద్ధమవుతున్నాం” అని సఫావీ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఎలాంటి ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు యుద్ధమొకటి జరగొచ్చు. దానితోనే అంతం కావచ్చు” అని ఆయన హెచ్చరించారు.

అమెరికాలో భారతీయులకు షాక్..

అమెరికాలోని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్‌లో రాత్రికి రాత్రే ధరలు ఆకాశాన్ని తాకాయి. అదీ కూడా కొత్త టారిఫ్‌లు ఇంకా అమలులోకి రాకముందే ఈ పరిస్థితి వారికి ఎదురయ్యింది. అమెరికాలోని ఎన్నారైలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్రోజెన్ పరాఠాలు లాంటి వస్తువుల ధరలు రాత్రికి రాత్రే 11.99 డాలర్లు నుంచి 13.99 డాలర్లకు పెరిగాయట. మామూలుగా ఏదైనా వస్తువు ధర పెరిగితే, రూపాయిలో 10, 20 పైసలు పెరుగుతుంది. మహా అయితే ఒక రూపాయి పెరుగుతుంది. కానీ అమెరికాలో […]

ఉక్రెయిన్ వార్, ట్రంప్ అలస్కా సమావేశం పై మోడీ-పుతిన్ చర్చలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో గత వారం అలాస్కాలో జరిగిన తన సమావేశం వివరాలను మోడీకి తెలియజేశారు. సంభాషణలో ప్రధానమంత్రి మోడీ ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారం మాత్రమే మార్గమని మరోసారి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, “శాంతియుత చర్చలు, దౌత్యంతో ముందుకు సాగాలని” పుతిన్‌కు తెలిపారు.

అమెరికాలో భారత ఇంజినీర్‌కు భారీ జరిమానా

భారత సంతతి ఏఐ ఇంజినీర్ ఇంటెల్ కంపెనీకి చెందిన గోప్య సమాచారం మైక్రోసాఫ్ట్‌కి లీక్ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన వరుణ్ గుప్తాకు అమెరికా కోర్టు $34,472 జరిమానావిధించింది. అంతే కాదు, అతను రెండేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉండాలన్న ఆదేశం కూడా జారీ చేసింది. 2020లో వరుణ్ ఇంటెల్‌ను వీడి మైక్రోసాఫ్ట్‌లో చేరాడు. ఆ సమయంలోనే అతను ఇంటెల్‌లోని కీలక డాక్యుమెంట్స్‌ను మైక్రోసాఫ్ట్‌కి పంపినట్టు తేలింది. ఇవి అతనికి ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర పోషించాయని […]

రష్యా-అమెరికా వాణిజ్యంపై పుతిన్‌ సంచలన ప్రకటన!

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాతో ఏ దేశం వాణిజ్య ఒప్పందం చేసుకోకూడదని.. ఆదేశం నుంచి దిగుమతులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుండి రష్యాతో అమెరికా వాణిజ్యం 20 శాతం పెరిగిందని పుతిన్‌ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రకటన ట్రంప్ పరిపాలనపై ప్రపంచ వాణిజ్య […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON