క్షణాల్లో బస్సు దహనం.. 71 మంది మృతి!
అఫ్గానిస్థాన్లో బస్సు ఆకస్మికంగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 17 మంది చిన్నారులతో సహా మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఇరాన్ నుంచి బహిష్కరణకు గురైన అఫ్గాన్ వలసదారులు బస్సులో స్వగ్రామాలకు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మోటార్ సైకిల్ను బస్సు ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాప్తించగా.. ప్రయాణికులు బయటపడే అవకాశం లేకుండా పోయింది.

