అప్గానిస్థాన్లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం.. 250 మంది మృతి
అఫ్గానిస్థాన్ నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో ఆదివారం రోజు అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 6.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. నిద్రలో ఉన్న ప్రజలను భయంకరంగా వణికించిన ఈ భూకంపం.. వందలాది మంది ప్రాణాలను బలిగొంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ విపత్తులో కనీసం 250 మందికి పైగా మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు.

