loader

అప్గానిస్థాన్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం.. 250 మంది మృతి

అఫ్గానిస్థాన్‌ నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో ఆదివారం రోజు అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 6.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. నిద్రలో ఉన్న ప్రజలను భయంకరంగా వణికించిన ఈ భూకంపం.. వందలాది మంది ప్రాణాలను బలిగొంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ విపత్తులో కనీసం 250 మందికి పైగా మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ – ప్రధాని మోడీ భేటీ

SCO సదస్సులో ప్రధాని మోడీని కలవడం, స్వాగతం పలకడం ఆనందంగా ఉందని జిన్‌పింగ్ అన్నారు. చైనా-భారత సంబంధాలు మళ్ళీ పుంజుకుంటున్నాయని చైనా, భారతదేశాలు రెండు ప్రాచీన నాగరికతలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు, గ్లోబల్ సౌత్‌లో ముఖ్య సభ్యులం” అని, ఈ సంవత్సరం భారత్-చైనా దౌత్య సంబంధాలకు 75వ వార్షికోత్సవం. “రెండు దేశాలు వ్యూహాత్మక దృక్పథంతో, దీర్ఘకాలిక దృష్టితో సంబంధాలను చూడాలి, నిర్వహించాలి” అని జిన్‌పింగ్ అన్నారు. ప్రధాని మోడీ కూడా రెండు దేశాల మధ్య […]

ఏఐ సాయంతో హత్య..తల్లిని చంపి..ఆపై ఆత్మహత్య… ప్రపంచంలోనే తొలిసారి

కృత్రిమ మేధస్సు సహాయంతో ఒక వ్యక్తి తన తల్లిని హత్య చేసిన ఘటన అమెరికాలో కలకలం రేపింది. చాట్‌జీపీటీని ఎక్కువగా వినియోగించే అతడు.. . తల్లి అతడిపై గూఢచర్యం చేస్తోందని, సైకెడెలిక్ డ్రగ్‌తో విషం ఇవ్వడానికి ప్రయత్నించవచ్చని చాట్‌బాట్‌ నమ్మించింది. చాట్‌బాట్ చెప్పింది నమ్మి కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రపంచంలోనే ఏఐ సాయంతో జరిగిన తొలి హత్యగా నమోదైంది. ఏఐతో ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు నివేదికలు అందుతోన్న […]

భారత్ – చైనా స్నేహితులుగా ఉండటమే మంచిది.. మోదీతో చైనా అధ్యక్షుడు

షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి జిన్‌పింగ్ మాట్లాడుతూ.. భారత్-చైనా స్నేహితులుగా ఉండటమే రెండు దేశాలకు మంచిదని అని అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, తూర్పున పురాతన నాగరికులగా ఒకరికొకరు విజయానికి సహకరించుకునే భాగస్వాములుగా ఉండాలని, మనపై ప్రజల శ్రేయస్సును మెరుగుపరచడం, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఐక్యతను ప్రోత్సహించడం అనే చారిత్రక బాధ్యత ఉంది’’ […]

పుతిన్‌ను కలవడానికి ముందు, ప్రధాని మోదీతో జెలెన్‌స్కీ ఫోన్ కాల్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి ముందు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 30 ) ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో మాట్లాడారు. ఆగస్టులో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన రెండవ టెలిఫోన్ సంభాషణ ఇది. జెలెన్‌స్కీతో జరిగిన సంభాషణ గురించి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్ నాయకుడి పిలుపునకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి పునరుద్ధరణకు భారతదేశం మద్దతును పునరుద్ఘాటించారు.

చైనాలో మోదీకి ఘన స్వాగతం

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి చైనాకు చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి అద్భుతమైన స్వాగతం లభించింది. శనివారం సాయంత్రం టియాంజిన్‌లోని బిన్హాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకోగానే అక్కడి ప్రవాస భారతీయులు సంబరాలు జరుపుకున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో మోదీని ఆహ్వానించారు. “వందేమాతరం”, “భారత్ మాతా కి జై” నినాదాలతో విమానాశ్రయం పరిసరాలు మార్మోగాయి.

డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఆయన తీవ్రమైన heart diseaseతో బాధపడుతున్నారని పుకార్లు వ్యాపించాయి, మరియు ఆయన ఇటీవల బహిరంగంగా కనిపించకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది. ట్రంప్ మీడియా ముందుకు రాకుండా, కేవలం తన Truth Social ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే సమాచారం పంచుకుంటున్నారు. అయితే, ట్రంప్ ఆరోగ్య పరీక్షలలో గుండె వైఫల్యం, కిడ్నీ సమస్యలు లేదా డీప్ వీన్ థ్రాంబోసిస్ (DVT) లాంటి తీవ్రమైన సమస్యలు లేవని వైట్ హౌస్ […]

అడల్ట్‌ వెబ్‌సైట్‌లో ఇటలీ ప్రధాని మెలోని ఫొటోలు..!

ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఒక అడల్ట్‌ వెబ్‌సైట్‌లో తనతో పాటు ఇతర మహిళల ఫొటోలను మార్పింగ్‌ చేసి ఉంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనను అసహ్యకరమైనది అని అభివర్ణించారు. నేరస్థులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫికా అనే వెబ్‌సైట్‌లో మెలోని, ఆమె సోదరి అరియానా, ఇటాలియన్ ప్రతిపక్ష నాయకురాలు ఎల్లీ ష్లీన్ మార్ఫింగ్‌ ఫోటోలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా, పబ్లిక్ సోర్సెస్ నుండి అనుమతి లేకుండా తీసిన ఈ చిత్రాలు, […]

జపాన్ పర్యటనలో మోదీకి ప్రత్యేక కానుక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో మొదటి రోజునే ఒక ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. జపాన్‌లో ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే దరుమా బొమ్మను దరుమాజీ ఆలయ ప్రధాన పూజారి రెవ్ సైషీ హిరోసే మోదీకి అందజేశారు. జపాన్‌లో దరుమా బొమ్మను అదృష్టం, పట్టుదల ప్రతీకగా భావిస్తారు. ఈ బొమ్మను సాధారణంగా కాగితపు గుజ్జుతో తయారు చేస్తారు. దీని కింద భాగం గుండ్రంగా ఉండటం వల్ల కింద పడినా వెంటనే లేచి నిలబడుతుంది.

నడిరోడ్డుపై ‘గట్కా’ ప్రదర్శన.. సిక్కు వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు..

రోడ్డు మధ్యలో గట్కా (కత్తితో ప్రదర్శన) ప్రదర్శిస్తున్న భారత సంతతికి చెందిన సిక్కు యువకుడ్ని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. అతడ్ని 36 ఏళ్ల గురుప్రీత్ సింగ్‌గా గుర్తించారు. లాస్ ఏంజెలెస్ డౌన్‌టౌన్‌లోని క్రిప్టో.కామ్ అరీనా సమీపంలో ఒక కత్తి పట్టుకుని ఉన్నాడని పోలీసులు తెలిపారు. నచ్చచెబుతున్నా వినిపించుకోలేదు సరికదా పోలీసులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించడంతో అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON