గాజా పై ఇజ్రాయెల్ దాడులు.. 47 మంది మృతి
గాజాపై ఇజ్రాయెల్ ఎడతెరపీ లేకుండా దాడులకు పాల్పడుతున్నది. ఇప్పటికే గాజా సిటీ మొత్తం పాడైపోయింది. అక్కడి ప్రజలు ఆహారం, మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ మళ్లీ గాజ-పై (Gaza) దాడులకు పాల్పడింది. తాజాగా జరిపిన దాడుల్లో సుమారుగా 47మంది పాలస్తీయన్లు మరణించారు. ఈ దాడులు ఇంకా పెరుగుతాయని గాజా నగరంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.

