loader

అదృష్టంగా భావిస్తున్నా.. వారికి నోబెల్‌ బహుమతి..సుందర్‌ పిచాయ్‌ ఆనందం

ఈ ఏడాది భౌతిక‌శాస్త్రం లో ముగ్గురు శాస్త్రవేత్తల‌కు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. ముగ్గురిలో ఇద్దరు గూగుల్‌ సంస్థలో మిషెల్‌ డెవోరెట్.. గూగుల్‌ క్వాంటమ్‌ ఏఐ ల్యాబ్‌లో హార్డ్‌వేర్‌ చీఫ్‌ సైంటిస్ట్‌గా, జాన్‌ మార్టినిస్‌ హార్డ్‌వేర్‌ టీమ్‌కి చాలా ఏళ్లుగా నాయకత్వం వహించారు.భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన మిషెల్‌ డెవోరెట్‌, జాన్‌ మార్టినిస్‌, జాన్‌ క్లార్క్‌లకు అభినందనలు. ఐదు మంది నోబెల్‌ గ్రహీతలు ఉన్న కంపెనీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ సుందర్‌ పిచాయ్‌ తన ఎక్స్‌ […]

రష్యా సైన్యంలో భారతీయుడు.. ఉక్రెయిన్ దళాలకు చిక్కిన గుజరాతీ.

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఈ యుద్ధంలో పోరాడుతున్న ఓ భారతీయ యువకుడిని ఉక్రెయిన్ దళాలు తాజాగా పట్టుకున్నాయి. 22 ఏళ్ల ఈ యువకుడు గుజరాత్‌లోని మోర్బి నివాసి సాహిల్ మొహమ్మద్ అని గుర్తించారు. మొహమ్మద్ మొదట్లో రష్యాకు చదువుకోడానికి వెళ్లి రష్యాలో డ్రగ్స్ కేసులో కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ శిక్ష నుంచి తప్పించుకునేందుకు మొహమ్మద్ యుద్ధంలోకి దిగినట్టు ఉక్రెయిన్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం…

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం వరించింది. 2025 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురుకి ప్రకటించారు. మాక్రోస్కోపిక్ క్వాంటమ్‌ పరిశోధనలకు గానూ జాన్ క్లార్క్,మిచెల్ హెచ్.డివోరెట్, జాన్ ఎం, మార్టిన్స్‌కు నోబెల్ పురస్కారం వరించింది.

జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దాడి‌.. పలువురు సైనికులు మృతి

పాకిస్థాన్‌లో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ను లక్ష్యంగా చేసుకొని భీకర దాడికి పాల్పడింది. సింధ్‌-బలూచిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో గల సుల్తాన్‌కోట్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఐఈడీ బాంబులు అమర్చి పేల్చింది. ప్రమాద సమయంలో పాక్‌ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పేలుడు దాటికి అనేక మంది సైనికులు మరణించినట్లు పేర్కొంది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చే వరకూ ఇలాంటి దాడులు కొనసాగుతాయని ఈ సందర్భంగా హెచ్చరించింది.

అమెరికాకు అరుదైన ఖనిజాలను నౌకలో ఎగుమతి చేసిన పాకిస్తాన్ సర్కార్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకునేందుకు పాకిస్తాన్ అరుదైన ఖనిజ సంపద దోచిపెట్టే కార్యక్రమం మొదలైంది. పాకిస్తాన్ లోని అరుదైన భూమి, కీలక ఖనిజాలతో కూడిన మొదటి నౌక అమెరికాకు బయలు దేరింది. పాకిస్తాన్ లో ఖనిజ వనరులను అన్వేషించేందుకు, ఓ అమెరికన్ కంపెనీతో సంతకం చేసిన ఒప్పందానికి అనుగుణంగా ఈ అరుదైన ఖనిజసంపద ఎగుమతి అవుతోంది. అమెరికాకు రవాణా అయిన వాటిలో యాంటీ మోనీ, రాగి గాఢత, నియోడైమియం, ప్రసోడైమియం వంటి అరుదైన […]

వైద్య శాస్త్రంలో ముగ్గురికి ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాలు

ఈ ఏడాది నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం దక్కింది. వీరిలో ఇద్దరు అమెరికన్లు, ఒక జపాన్‌ శాస్త్రవేత్త ఉన్నారు. మేరీ బ్రంకో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకాగుచికు ఈ సారి నోబెల్ బహుమతి దక్కింది. రోగ నిరోధక వ్యవస్థపై వీరు చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురస్కారాలు దక్కాయి.

భూటాన్ వరదల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది?

భూటాన్ లో వరదలు ముచ్చెత్తుతున్నాయి. గత కొన్నిరోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు భూటాన్ అతలాకుతలమైంది. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదల వల్ల వేలాదిమంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఎంతమంది చనిపోయారనే విషయం ఇంకా తెలియాల్సిఉంది. అయితే భారీ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు కొట్టుకునిపోయాయి. ఇక బ్రిడ్జ్లు కొట్టుకునిపోవడంతో కొన్ని గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వారిని ఆదుకునేందుకు భూటాన్ అధికారులతో పాటు భారత సైనికులు సహాయక చర్యలు చేపట్టారు.

మౌంట్‌ ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. సుమారు 1,000 మంది పర్వతారోహకులు వేల అడుగుల ఎత్తులో ఈ తుఫానులో చిక్కుకుపోయారు. ఇప్పటి వరకూ దాదాపు 350 మందిని రక్షించినట్లు సమాచారం. వాళ్లందరినీ ఆదివారం నాటికే క్యూదాంగ్‌ పట్టణానికి తరలించారు. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో వారంతా చిక్కుకుపోయినట్లు చైనా మీడియా పేర్కొంది.

ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కేంద్రంగా ఉన్న ‘ఇన్వర్షన్’ సంస్థ అంతరిక్ష రంగంలో కొత్త అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్ ‘ఆర్క్’ ను ఆవిష్కరించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వాహనం ద్వారా అంతరిక్షం నుంచి భూమిపై ఏ ప్రాంతానికైనా ఒక గంటలోపు వస్తువులను డెలివరీ చేయగల సామర్థ్యం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ‘ఆర్క్’ (RK) వాహనం పొడవు 8 అడుగులు, వెడల్పు 4 అడుగులు ఉండి పెద్ద టేబుల్‌టాప్ పరిమాణంలో ఉంటుంది.

మరోసారి మా జోలికి వస్తే దెబ్బకు దెబ్బే.. పాక్ మంత్రి హెచ్చరికలు

మరోసారి తమపైకి సైనిక దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతదేశానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు వెలువరించారు. పాకిస్థాన్‌తో సైనిక దుస్సాహాసానికి దిగితే తాము ఈసారి ఘాటైన రీతిలో జవాబు ఇచ్చి తీరుతామని ఆయన ఆదివారం ప్రకటించారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇటీవలే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైనిక దళాల చీఫ్ ద్వివేదిలు వేర్వేరుగా పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ రెండో దశ ఉంటుందని ప్రకటించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON