అమెరికాకు ఇరాన్ లొంగదు: ట్రంప్నకు పెజెష్కియన్ స్ట్రాంగ్ కౌంటర్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగదని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడేందుకు అందరూ ఒక్కటై నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను ఉద్దేశించి తాజాగా మాట్లాడిన ఆయన, అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోకుండా అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కడ కావాలంటే అక్కడ బాంబులు వేస్తున్నాయని ఆరోపించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ముఖ్య కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.

