తూచ్! మేం బీఆర్ఎస్ వీడలేదు… మా మెడలో సీఎం వేసింది కాంగ్రెస్ కండువా కాదు
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలకు గానూ 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తాము బీఆర్ఎస్ పార్టీని వీడలేదని ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాము సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు వివరణ ఇచ్చారు. సీఎం, ఇతర నాయకులు తమ మెడలో వేసింది కాంగ్రెస్ కండువాలు మాత్రం కాదని […]

