loader

చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం

యూఏఐ పర్యటనపై బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం దుబాయ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు ఘన స్వాగతం లభించింది. స్థానిక భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ ఇతర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. చంద్రబాబును ఆహ్వానించేందుకు ప్రవాసాంధ్ర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలి వచ్చారు.

మా నాన్న రాజకీయ జీవితం ముగిసినట్లే- సిద్ధరామయ్య కుమారుడు

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై రాజకీయ వేడి కొనసాగుతోన్న వేళ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని బాంబు పేల్చారు. అంతేకాకుండా కర్ణాటకలో కాంగ్రెస్‌ నాయకత్వాన్ని నడిపించేందుకు సతీశ్ ఝర్కిహోళి అర్హుడంటూ సీఎం మార్పుపై సంకేతాలు ఇచ్చారు. బెళగావి జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యతీంద్ర సిద్ధరామయ్య, ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భారీగా నామినేషన్లు తలలు పట్టుకున్న ప్రధాన పార్టీలు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కొనసాగుతున్న నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉధృతంగా జరిగింది. నామినేషన్ల చివరి రోజున అధికారులు 321 నామినేషన్లు స్వీకరించినట్లు నిర్ణయించారు. ప్రారంభమైన తొలి ఆరు రోజుల్లో కేవలం 94 మంది మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు వేయగా, చివరి రోజున ఏకంగా 117 మంది వచ్చి 194 ఫారమ్‌లను సమర్పించారు. భూమి స్వాధీనీకరణ సమస్యలు, ఎస్‌ఐ వర్గీకరణకు సంబంధించిన అసంతృప్తులు వంటి అంశాలు ఒకరకంగా ఈ నామినేషన్ బూస్థ్‌కు కారణమయ్యాయని […]

NTR విగ్రహానికి తల బాదుకుని టీడీపీ సీనియ‌ర్ కార్య‌క‌ర్త‌ కన్నీళ్లు..

నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ కార్యకర్త ఆవుల రెడ్డి వీడియో వైరల్ అవుతోంది. తన పదవి నుంచి వైదొలగాలని.. స్థానిక నాయకుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ భర్త నాగరాజు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఆవుల రెడ్డి హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం శిరివరం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మంగళవారం రాత్రి ఆవులరెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి తల బాదుకొని, విగ్రహానికి మొరపెట్టుకున్నారు.

ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీష్ రావు..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రవెళ్లి ఫాంహౌస్ లో సమావేశం అయ్యారు. కేసీఆర్ పిలుపుతో కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లి ఫాం హౌస్ కు వెళ్లి భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో రోడ్ షో లు, ప్రచార వ్యూహం పై డిస్కషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఎలా ముందుకెళ్లాలని సైతం కేటీఆర్, హరీష్ రావులతో కేసీఆర్ చర్చించే […]

ఎంపీ రాఘవేంద్ర సంచలన కామెంట్స్.. ఆ ఎన్నికలకు ఇక్కడి నుంచి సొమ్ము

బిహార్‌ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది. సుమారు 2వేల కోట్ల రూపాయలు సమకూర్చాలని అధిష్ఠానం అల్టిమేటం ఇచ్చిందని అందుకే ఇటీవల సీఎం మంత్రులకు విందు పేరిట టార్గెట్‌ ఇచ్చారని ప్రతిపక్షనేత అశోక్‌ ఘాటుగా విమర్శించిన విషయం విదితమే. ఎంపీ రాఘవేంద్ర వ్యాఖ్యలపై డీసీఎం డీకే శివకుమార్‌ సున్నితంగా మందలించారు. బీజేపీ, జేడీఎస్‏లో వారి తరహాలో నీవెందుకు […]

తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం.. బాంబు పేల్చిన ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం.. రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే సర్వనాశనం చేసిండు స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన మాటలు సౌత్‌ ఫస్ట్‌ ఎడిటర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడని. పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నారని. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మన పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అయ్యిందని కాంగ్రెస్‌ […]

హరీష్‌కు మంత్రి అడ్లూరి ఛాలెంజ్

హరీష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా అంటూ ఫైర్ అయ్యారు. కేబినెట్లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామా? హరీష్ సెంటిమెంట్‌గా భావించే దేవుడిపై ప్రమాణం చేయగలడా? ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామా? ఛాలెంజ్‌ను హరీష్ స్వీకరించాలి. కొండా సురేఖ బిడ్డ.. మా అందరికీ బిడ్డ లాంటిదే’ అంటూ మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్‌ జగన్‌ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్‌కు బల్మూరి వెంకట్ వార్నింగ్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ BRS పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేక అనుచిత పోస్టులను ఖండించి, కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే సైబర్ దాడులు చేస్తామని హెచ్చరించి, యువత, విద్యార్థుల మనోభావాలు దెబ్బ తినడానికి కేటీఆర్ బాధ్యుడని, అది జరిగితే రాష్ట్రవ్యాప్తంగా యువత, విద్యార్థులు రోడ్లపై దిగి BRS నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తామని, కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON