చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్లో సీఎంకు ఘన స్వాగతం
యూఏఐ పర్యటనపై బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం దుబాయ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు ఘన స్వాగతం లభించింది. స్థానిక భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ ఇతర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. చంద్రబాబును ఆహ్వానించేందుకు ప్రవాసాంధ్ర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలి వచ్చారు.

