loader

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్‌

మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేశ్‌ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడంతో మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.

అజారుద్దీన్‌కు మంత్రి ప‌ద‌వి.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

అజారుద్దీన్ మంత్రి ప‌ద‌విపై తెలంగాణ బీజేపీ స్పందించింది. అజారుద్దీన్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని బీజేపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఇది ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డితో పాటు లీగల్ సెల్ కలిసి ఫిర్యాదు చేసింది.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌: కేటీఆర్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసమే మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనమని చెప్పారు. అందుకే కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సరైన వేదిక అని చెప్పారు. ఈమేరకు కేటీఆర్ ఎక్స్‌ వేదికగా […]

బీజేపీ ఎమ్మెల్యేని తరిమిన గ్రామస్థులు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రచారం చేసేందుకు దయాల్‌పూర్‌ పంచాయతీని బుధవారం సందర్శించిన వైశాలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అవదేష్‌ సింగ్‌ని గ్రామస్థులు తరిమికొట్టారు. గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ గ్రామం మొహం చూడని ఎమ్మెల్యే ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని కలుసుకోవడానికి ఆయన ఇంటికి వెళితే ఆయన బాడీగార్డు తమను తరిమివేశాడని వారు గుర్తు చేశారు.

‘నీ పిల్లల ముందే.. చంపేస్తా,’ నవనీత్ రాణాకు బెదిరింపులు

మహారాష్ట్ర బీజేపీ నేత, అమరావతి మాజీ ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపు లేఖ వచ్చింది. స్పీడ్ పోస్టు ద్వారా వారి అమరావతి కార్యాలయ చిరునామాకు వచ్చిన లేఖతో తీవ్ర పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందులో అత్యంత అసభ్యమైన భాషను ఉపయోగిస్తూ, ప్రాణహాని,సామూహిక దాడి చేస్తామని హెచ్చరించారు. అలాగే, తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, హైదరాబాద్‌కు చెందిన జావేద్ అనే వ్యక్తి ఈ లేఖను పంపినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతని జాడను […]

ఓట్ల కోసం ప్రధాని భరతనాట్యం చేయమన్నా చేస్తారు : రాహుల్‌గాంధీ

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దర్భంగా ప్రచారసభలో రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో లబ్దిపొందడానికి ఏదో ఒక డ్రామా ఆడుతారని అయితే యమునా నదిలో స్నానం, కుంటలోకి స్వచ్ఛమైన నీళ్లను వదిలే పైపు ఫొటో బయటపడటంతో ఆ డ్రామా బెడిసికొట్టిందని, ప్రచార సభలో ఓ 200 మంది లేచి ఓట్ల కోసం డ్యాన్స్‌ చేయాలని ప్రధానిని కోరితే వెంటనే డ్యాన్స్‌ మొదలవుతుందని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఏకంగా భరతనాట్యమే […]

మంత్రిగా ఎమ్మెల్సీ అజారుద్దీన్‌‌కు చాన్స్..!

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీకి చోటు లభించింది. మంత్రిగా.. ఎమ్మెల్సీ అజారుద్దీన్‌ను తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. శుక్రవారం క్యాబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పరోక్షంగా MIM మద్దతు కూడగట్టింది కాంగ్రెస్ పార్టీ. తాజాగా రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీకి చోటు కల్పించి.

ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం.. మహాఘట్‌ బంధన్‌ మేనిఫెస్టో

వచ్చే నెలలో జరగబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన విపక్ష మహాఘట్‌బంధన్‌ కూటమి మంగళవారం తేజస్వీ ప్రాణ్‌ (తేజస్వీ ప్రతిజ్ఞ) పేరిట ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో ప్రతి ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చట్టాన్ని చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. ప్రతి మహిళకు డిసెంబర్‌ 1నుంచి నెలకు రూ.2,500 చొప్పున ఐదేండ్ల పాటు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చింది.

టికెట్ ధరలు పెంచితే..20% లాభం సినీ కార్మికులకే : సీఎం రేవంత్

టిక్కెట్ ధరల పెంపు సినిమా ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 20 శాతం వాటాను కూడా కార్మికులకు ఇవ్వాలని సినీ ఇండస్ట్రీకి స్పష్టం చేశారు. ఈ షరతులను పాటిస్తేనే భవిష్యత్తులో టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తామని, అందుకు సంబంధించిన జీవోలో నిబంధనలను సడలిస్తామని, యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన సినీ కార్మిక సంఘాల అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు

హైదరాబాద్ను రక్షించండి- ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు’- ఒవైసీకి PK సూచన

జన్‌ సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ AIMIM అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సాబ్‌ నా స్నేహితుడు. ఇదే నా సలహా. మీరు హైదరాబాద్పైనే దృష్టి పెట్టండి. మీ బలమైన ప్రాంతమైన హైదరాబాద్ను రక్షించండి. అక్కడి ముస్లింల సంక్షేమం కోసం పనిచేయండి. బిహార్‌ సీమాంచల్‌లోకి వచ్చి రాజకీయ గందరగోళం సృష్టించడం అవసరం లేదు” అని అన్నారు. 2020లో ముస్లింలు చేసిన తప్పును ఈసారి సీమాంచల్‌ ప్రజలు పునరావృతం చేయరు” అని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON