టీడీపీ ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్.. పద్ధతి మార్చుకోవాలి, ఇదే ఫైనల్ ఛాన్స్
టీడీపీ ఎమ్మెల్యేకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.. ఇకపై పద్ధతి మార్చుకోవాలని పల్లా ఎమ్మెల్యేకు చెప్పారు. కొంతకాలంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తుండటంతో.. అధినేత చంద్రబాబు ఆదేశాలతో పల్లా హెచ్చరించారు.

