loader

టీడీపీ ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్.. పద్ధతి మార్చుకోవాలి, ఇదే ఫైనల్ ఛాన్స్

టీడీపీ ఎమ్మెల్యేకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.. ఇకపై పద్ధతి మార్చుకోవాలని పల్లా ఎమ్మెల్యేకు చెప్పారు. కొంతకాలంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తుండటంతో.. అధినేత చంద్రబాబు ఆదేశాలతో పల్లా హెచ్చరించారు.

డిప్యూటీ సీఎంను కలిసిన బాలకృష్ణ, నాగబాబు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్‌లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత నాగబాబు కూడా సోదరుడిని కలిశారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఇద్దరి మధ్య చర్చ […]

బంగ్లాదేశ్‌లో పోలింగ్ ప్రారంభం- హసీనా పార్టీ లేకుండా తొలి ఎన్నిక ఇదే

ఏడాదిన్నరగా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లో గురువారం 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 2024 ఆగస్టులో విద్యార్థుల భారీ ఉద్యమంతో కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక పాలనకు ఇవి ముగింపు పలకనున్నాయి. ఈసారి 299 పార్లమెంట్ స్థానాలకు 1,981 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రధాన పార్టీ       అవామీ లీగ్‌ లేకుండా ఎన్నికలు జరగడం ఇదే […]

మావోల బెదిరింపులు.. ఎపి మంత్రుల ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

ఎపిలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్‌లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. అసలు కారకులను గుర్తించేందుకు పోలీసులు, ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగాయి. మరోవైపు మంత్రుల భద్రతను పర్యవేక్షించే అధికారులు కూడా ఈ లేఖల అసలు మూలాలను ఆరా తీస్తున్నారు. మావోయిస్టుల లేఖలు వచ్చి న కారణంగా ఆ నలుగురు మంత్రుల నివాసాల వద్ద […]

అంబటి రాంబాబుకు షాకిచ్చిన పోలీసులు – మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుకు కోర్టులో ఊరట లభించిన కొద్ది గంటల్లోనే మళ్ళీ చిక్కులు మొదలయ్యాయి. ఆయన జైలు నుంచి విడుదల కాకుండానే సత్తెనపల్లి పోలీసులు గుంటూరు సబ్ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 నాటి సంక్రాంతి లక్కీ డ్రా అవినీతి కేసులో ఆయనను విచారించాల్సి ఉందని పోలీసులు పేర్కొనడంతో ఆయన విడుదలపై సందిగ్ధత నెలకొంది.

ప్రతి ఒక్కరూ కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి…మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలి: సీఎం, డిప్యూటీ సీఎం

రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని… ఇది శుభ పరిణామమని చెప్పిన సీఎం ఇదే ఐక్యత ఇకపైనా కొనసాగాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ 20 నెలల్లో చాలా కష్టపడి, ఐక్యంగా పని చేశామని సమావేశంలో పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని, ఐక్యంగా ముందుకు వెళతుందని […]

డీఎంకే ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. అయినా కాంగ్రెస్‌తోనే వెళ్తాం : సీఎం స్టాలిన్

తమిళనాడులో తమ డీఎంకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని. ఇంకా చెప్పాలంటే 2021కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సోదరుడిలాంటి అనుబంధం ఉంది. డీఎంకే-కాంగ్రెస్ మధ్య పొత్తు బలంగా ఉంది. ఆ పార్టీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తాం. అయితే, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగమవుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం అని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ స్టాలిన్ ఈ విషయాలు వెల్లడించారు.

సీఐ శివకుమార్‌ సంగతి తేల్చేస్తా.. పోలీసులపై జగ్గారెడ్డి బూతుపురాణం

సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద సీఐపై జగ్గారెడ్డి ఊగిపోయారు.రిగ్గింగ్ చేస్తున్నాడని చెబితే నా అభ్యర్థిని గళ్ల వట్టి కొట్టిండు.. సీఐ శివకుమార్‌ మొగోడైతే ఈడికి రావాలి. మీరు ఏమనుకుంటున్నరు.. జగ్గారెడ్డి ఎవరంటారు..సీఐ సంగతి నేను తేల్చేస్తా.. అరే ఓ హోంగార్డు ఒక అమ్మకు అయ్యకు పుట్టి ఉంటే రారా నా కొడుకా..అంటూ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో పోలీస్ అధికారులపై విరుచుకుపడిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

దొంగ ఓట్లు పడుతున్నాయని ఆందోళన.. బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్

కరీంనగర్ 58వ డివిజన్‌లోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఒక మహిళకు తాను ఇది వరకే ఓటు వేసినట్లు ఉందని పోలింగ్ సిబ్బంది చెప్పారు. దీంతో దొంగ ఓట్లు పడుతున్నాయని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్థ పరిస్థితులు నెలకొన్నాయి. గొడవ కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో ఆర్మీ, పోలీసుల బృందం రంగంలోకి దిగింది. లాఠీ చార్జ్ చేసి […]

అంబటికి బెయిల్.. రేపు విడుదలయ్యే అవకాశం

రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు.. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌నూ కొట్టివేసింది న్యాయస్థానం. ప్రస్తుతం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి.. ఈ బెయిల్‌తో రేపు(గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు,  […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON