loader

ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు..వంగవీటి ఆశా కిరణ్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో ప్రముఖ నేత కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె మరెవరో కాదు దివంగత వంగవీటి మోహనరంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్. విజయవాడలో ఆదివారం నాడు తన తండ్రి వంగవీటి మోహన రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాధా రంగా మిత్రా మండలి మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించడానికి తాను వస్తున్నానని ఆశా […]

అక్రమ ఎన్నికల్లో గెలవలేకపోయాం: బీహార్ ఫలితంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

బీహార్ ఎన్నికల్లో మరీ దారుణ ఫలితం దక్కించుకున్న కాంగ్రెస్ కూడా ఓటమిపై స్పందించింది. పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం దీనిపై వ్యాఖ్యానించారు. ఓటమిపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించుకుంటామని వివరించారు. అయినా ఎన్నికల ప్రక్రియ ఆది నుంచే సాగిన అక్రమ వ్యవహార క్రమంలో తాము గెలవలేకపోయామని రాహుల్ స్పందించారు. మహాఘట్‌బంధన్ పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన లక్షలాది మంది ఓటర్లకు తమ హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.

రోహిణి ఆచార్య పేర్కొన్న.. సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు?

రోహిణి ఆచార్య సంచలన ప్రకటన నేపథ్యంలో ఆమెను ప్రభావితం చేసిన సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు? అన్నది చర్చనీయాంశమైంది. సంజయ్ యాదవ్ ఆర్జేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ. లాలూ కుమారుడు, ఆ పార్టీ వారసుడు తేజస్వి యాదవ్‌కు అత్యంత విశ్వసనీయ అనుచరుడు. ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయ కుటుంబానికి చెందిన తేజస్వి యాదవ్‌ పాత స్నేహితుడు రమీజ్‌. అయితే వీరిద్దరూ రోహిణి ఆచార్యకు ఏమి చెప్పారు అన్నది ఆమె పోస్ట్‌లో స్పష్టత లేదు.

బీహార్‌లో రెబల్స్‌పై బీజేపీ చర్యలు.. మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలు సస్పెండ్‌

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత రెబల్స్‌పై బీజేపీ దృష్టి సారించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్న కేంద్ర మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలను సస్పెండ్‌ చేసింది కేంద్ర మాజీ మంత్రి ఆర్‌కే సింగ్, శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌కు షోకాజ్‌ నోటీసులు పంపింది. బీహార్‌లోని అర్రా మాజీ ఎంపీ అయిన ఆర్‌కే సింగ్ 2017లో మోదీ తొలి మంత్రివర్గంలో విద్యుత్ మంత్రిగా పనిచేశారు. 2024 […]

నీతీశ్ ఇంటికి చిరాగ్- డిప్యూటీ సీఎం పదవి కోసమేనా?

బిహార్‌లో ఎన్​డీఏ చరిత్రాత్మక విజయంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కీలక పరిణామం జరిగింది. ఎన్​డీఏలోని కీలక పార్టీ రామ్‌ విలాస్‌ లోక్‌జన్‌ శక్తి అధినేత చిరాగ్‌ పాసవాన్‌, జేడీయూ చీఫ్‌, ప్రస్తుత సీఎం నీతీశ్‌ కుమార్‌తో భేటీ అయ్యారు. నీతీశ్‌ నేతృత్వంలో ఎన్​డీఏ ఘన విజయాన్ని అందుకుందని, అందుకే అభినందించడానికి వెళ్లానని చిరాగ్‌ పాసవాన్‌ తెలిపారు. అయితే డిప్యూటీ సీఎం పదవి తమకు ఇవ్వాలని కోరేందుకే చిరాగ్‌ వెళ్లినట్లు ప్రచారం […]

బిహార్ ఫలితాలు ఆశ్చర్యపరిచాయి- ఈ ఎన్నికల్లో మొదట్నుంచీ అన్యాయమే: రాహుల్‌ గాంధీ

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్, ఈ ఎన్నికలు మొదటినుంచి న్యాయంగా జరగలేదని ఆరోపించారు. మహాగఠ్‌బంధన్‌పై విశ్వాసంతో ఓట్లు వేసిన లక్షలాది మంది బిహార్‌ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ పోరాటమని తెలిపారు.

సొంత రాష్ట్రంలో ఫలించని వ్యూహకర్త వ్యూహాలు..

దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరచుకున్న ప్రశాంత్ కిశోర్ ఈసారి తన స్వరాష్ట్రం బిహార్‌లో మాత్రం ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో తాను రూపొందించిన ప్రచార నినాదాలు, సర్వేలు, సోషల్ మీడియాలో చేసిన వ్యూహాలు అనేక పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చాయి. కానీ ఈసారి స్వరాష్ట్రంలో తన పార్టీకి ఇచ్చిన నినాదాలు మాత్రం పనిచేయలేదు. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా ఆయన పార్టీ జన్ సురాజ్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం […]

బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ‘స్టేట్ ఐకానిక్’ మైథిలీ ఠాకూర్

బిహార్ శాసనసభ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో కీలకమైన అలీనగర్ శాసనసభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తొలిసారి బరిలోకి దిగారు మైథిలీ. ఆమెకు మెుత్తం 84,915 ఓట్లు రాగా.. 11,730 ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. మైథిలీ ఠాకూర్.. గతంలో బిహార్ ఎన్నికల కమిషన్ తరఫున ‘స్టేట్ ఐకానిక్(State […]

ఎన్డీయే విజయంపై నీతీష్‌కు మోదీ అభినందనలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎన్డీయే నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఎన్డీయే చేసిన ప్రజాసేవకు పట్టంకడుతూ ప్రజలు రీసౌండింగ్ తీర్పునిచ్చారని . ప్రధాని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వరుస పోస్టులు పెట్టారు. ‘సుపరిపాలన విజయం సాధించింది. అభివృద్ధికి గెలుపు వరించింది. ప్రజాసంక్షేమ స్ఫూర్తి విజయం సొంతం చేసుకుంది. సామాజిక న్యాయం గెలిచింది’ అని మోదీ అన్నారు. ఎన్డీయేను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు […]

రాఘోపూర్‌లో ఎట్ట‌కేల‌కు తేజ‌స్వీ యాద‌వ్ గెలుపు

ఆర్జేడీ నేత తేజస్వీ యాద‌వ్ ఎట్ట‌కేల‌కు గెలిచారు. 11 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్య‌ర్థి స‌తీష్ కుమార్ యాద‌వ్‌పై తేజ‌స్వీ యాద‌వ్ విజ‌యం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో కొన‌సాగిన తేజ‌స్వీ.. ఆ త‌ర్వాత వెనుకంజ‌లో ఉన్నారు. చివ‌ర‌కు ఎట్ట‌కేల‌కు విజ‌యం వ‌రించింది. తాజా గెలుపుతో తేజ‌స్వీ యాద‌వ్ వ‌రుస‌గా మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్ట‌నున్నారు. తేజ‌స్వీ యాద‌వ్‌కు 1,19,780 ఓట్లు పోల‌య్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON