loader

కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ చాకూర్కర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. లాతూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు గెలిచారు.లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. 2004లో లోక్ సభలో ఓడిపోయినప్పటికీ, రాజ్యసభ నుంచి హోం మంత్రి పదవిని మరియు కేంద్ర బాధ్యతలను స్వీకరించారు.

ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి..

మొయినాబాద్‌లోని ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా వైసీపీ నేత మద్యం పార్టీ నిర్వహించడం కలకలం రేపుతోంది. ఈ పార్టీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన భార్య మాధురి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం మొయినాబాద్ లోని ఫామ్‌హౌస్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి లిక్కర్ పార్టీ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. ఈ మందు పార్టీలో అనుమతి లేకుండా మద్యం వినియోగించారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పెండెంట్ ఫామ్‌హౌస్‌పై గురువారం రాత్రి […]

95 ఏళ్ల వయసులో పోటీ.. సర్పంచ్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తండ్రి..!

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తండ్రి గంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు. 95 ఏళ్ల వయసులో ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మండల కేంద్రమైన నాగారం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తద్వారా రాష్ట్ర చరిత్రలో అత్యధిక వయస్కుడైన సర్పించ్‌గా రామచంద్రారెడ్డి రికార్డు నెలకొల్పారు.

కేటీఆర్‌ పరువు నష్టం దావా.. మంత్రి కొండా సురేఖపై నాన్‌ బెయిలబుల్ వారెంట్

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు కొండా సురేఖపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కొండా సురేఖను అరెస్ట్‌ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. నాంపల్లి స్పెషల్ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.

ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబు ‘కాఫీ కబుర్లు’

ఎన్టీఆర్ భవన్​లో కాఫీ కబుర్లు పేరుతో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో చంద్రబాబు కాఫీ కబుర్లు చెప్పారు. శిక్షణ కార్యక్రమాలు ఎలా జరిగాయని అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన శిక్షణ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వాలను మెరుగు పరుచుకోవాలని సీఎం సూచించారు. పార్టీ సిద్దాంతాలు, భావజాలం ప్రతి కార్యకర్తకు తెలియాల్సిన అవసరం ఉందని సీఎం వెల్లడించారు.

వంటింటి ఆయుధాలతో రెడీగా ఉండాలన్న మమతా బెనర్జీ

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో పేర్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే, మహిళలు తాము వంటగదిలో ఉపయోగించే పరికరాలతో సిద్ధంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓటు హక్కును లాక్కోవడానికి చేసే ఏ ప్రయత్నాన్నీ సహించబోమని ఆమె హెచ్చరించారు. ఎన్నికల జాబితా నుంచి మహిళల, యువతుల పేర్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకొచ్చి బెదిరింపులు […]

సర్పంచ్ ఎన్నికలలో తొలి విడత కాంగ్రెస్ పార్టీ హవా

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది తొలి స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 1296 స్థానాలలో గెలుపొందగా.. బిఆర్ఎస్ 612, బిజెపి 111, ఇతరులు 281 స్థానాలలో విజయం సాధించారు. వార్డు మెంబర్లలో కాంగ్రెస్ 11230 స్థానాలలో గెలుపొందగా బిఆర్‌ఎస్ 5000, బిజెపి 2000, ఇతరలు 7500 స్థానాలలో విజయ దుందుభి మోగించారు. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇతరుల స్థానాలలో గెలిచిన […]

తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్  బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహార విందు ఇచ్చారు.  పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రాల్లో పార్టీ  పరిస్థితి, ప్రతిపక్ష పాత్ర వంటి వాటిపై మాట్లాడారు.   ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రశంసించారు.  వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలకు బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని అడిగినట్లుగా చెబుతున్నారు.  తెలంగాణలో పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించకపోవడంపై మోదీ […]

ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. కొన్ని గ్రామాలలో సమయంలో లైన్‌లో నిలబడిన ఓటర్లకు ఓటు వేయవచ్చును. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటల వరకు 52 శాతం […]

కాసేపట్లో ముగియనున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల సమరం రాష్ట్రవ్యాప్తంగా 3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు పోలింగ్, ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది.|  మధ్యాహ్నం ఒంటిగంటకు ముగియనున్న పోలింగ్‌  |  ఒంటిగంట లోపు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం  |  మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు  |  రాష్ట్రవ్యాప్తంగా ఉ. 11 గంటల వరకు 52 శాతం పోలింగ్‌ నమోదు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON