loader

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల..

బిహార్‌ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ వెల్లడించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్లను స్క్రుటినీ […]

రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు- పూర్తి షెడ్యూల్ ఇదే

బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. రెండుదశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడతకు అక్టోబర్ పదో తేదీన, రెండో విడతకు పదమూడో తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. నవంబర్ పధ్నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. బీహార్‌లో 243 స్థానాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్‌లో  ఈ ఎన్నికల్లో 7.42 కోట్ల మంది ఓటర్లు  ఓటు […]

వాటికి ఆధార్‌ సాక్ష్యం కాదు.. అప్పటికల్లా బిహార్ ఎన్నికలు పూర్తి చేస్తాం: సీఈసీ

సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం బృందం బీహార్‌లో పర్యటించింది.ఒకట్రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని పొలిటికల్‌ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించాలని జేడీయూ కోరింది. నవంబర్‌ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. తొలిసారి ఈవీఎం బ్యాలెట్‌ షీట్‌పై అభ్యర్థుల ఫోటోలు, ఎన్నికల గుర్తును కలర్‌ ఫోటోలతో పాటు, అభ్యర్థుల సీరియల్‌ నెంబర్లను పెద్దగా ముద్రిస్తామన్నారు. పౌరసత్వం, డేటా ఆఫ్‌ బర్త్‌కు ఆధార్‌ సాక్ష్యం కాదని స్పష్టం చేశారు.

జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ..

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. నామినేట్ పోస్టులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల నేతలతో కలిసి పని చేయాలని సూచించారు. అభిప్రాయ బేధాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు […]

కారు కూతలు కూస్తే చెప్పుతో కొడతా… తోపుదుర్తికి, పరిటాల సునీత వార్నింగ్

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొడుతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హౌసింగ్ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.10 వేలు వసూలు చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిరుపేదలని కూడా చూడకుండా లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డిపై.. కాంగ్రెస్ నేత క‌న్న‌య్య కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ఇంచార్జి క‌న్న‌య్య కుమార్ విరుచుకుప‌డ్డారు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు.. తెలివితక్కువ వాడు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడని రేవంత్ రెడ్డిని నిల‌దీశారు. దొంగతనం చేసే వారిని దొంగలు అని అంటారు.. తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అంటారు అని, రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడే అని అంటా.. నేను భయపడను అని కాంగ్రెస్ […]

కరూర్ ఓకే.. మణిపూర్ సంగతేంటి..బీజేపీపై స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. మణిపూర్‌లో గత రెండేళ్లుగా అల్లర్లు, హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అక్కడ బీజేపీ ఎంపీలు ఎందుకు సందర్శనకు వెళ్లలేదని ఆయన సూటిగా అడిగారు. మణిపూర్‌లో 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారని, అయినప్పటికీ కేంద్రం నిశ్శబ్దంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆయుధ పూజనా?.. వెపన్స్ దుకాణమా..?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యాదసరా ఆయుధ పూజ సందర్భంగా.. దాదాపు 200కు పైగా ఆయుధాలను పేర్చి పూజ నిర్వహించారు. ఇప్పుడిదే వీడియో యూపీలో వైరల్ అయింది. ఇలా బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శించడంపై వివాదం చెలరేగింది.<span;>200కు పైగా ఆయుధాలుండటంపై పోలీసులు నజర్ పెట్టారు. ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?. వీటన్నింటికి పర్మిట్ ఉందా లేదా అనేది తెలుసుకుంటున్నారు.

మహిళలను వివస్త్రలను చేసిన కొట్టిన NSUI అధ్యక్షుడు.. జూబ్లీహిల్స్‌

మంత్రి వివేక్‌ వెంకటస్వామి రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని బ్రహ్మశంకర్‌ నగర్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఉన్నారని ఒక మైనర్‌తోపాటు ముగ్గురు మహిళలపై వెంకటస్వామి తన అనుచరులతో కలిసి దాడిచేశాడు. స్థానిక కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి వర్గంపై కోపంతో.. ఆయన మనుషులు తనకు అడ్డుగా ఉన్నారని వారిపై దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులతో కలిసి వెంకటస్వామి ఇండ్లలోకి దూసుకెళ్లి, మహిళలని కూడా చూడకుండా వివస్త్రలను చేసి కొట్టాడని స్థానిక కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు.

సంఘ్ బలం మాటల్లో కాదు.. చేతలలో ఉంది: ఆర్‌ఎస్‌ఎస్‌కు పవన్ కల్యాణ్ విషెస్..

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దేశానికి సేవ చేసే గొప్ప సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని పవన్ కొనియాడారు. క్రమశిక్షణ, సేవ, జాతీయత మొదలైన అంశాలలో అద్భుతమైన నిబద్ధతను చూపిన ఆర్‌ఎస్ఎస్ పవిత్రమైన విజయదశమి రోజున వంద అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON