loader

గిరిజన సర్పంచ్‌పై అగ్ర కులస్తుల దాడి.. ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు..!

మండల పరిధిలోని రేగుల గడ్డ సర్పంచ్‌ ధనావత్ గుణ నాయక్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. నిరూపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరొక చోట పాతాలని చెప్పినందుకు ఆయనపై దాడికి దిగారు. ‘మా ఇంటి దగ్గర స్తంభాన్ని తరలించాలని చెబుతావా?’ అని చామల ఉపేందర్ రెడ్డి, చామల పెద్ద రామిరెడ్డిలు సర్పంచ్‌పై దాడి చేశారు. వారి దాడిలో సర్పంచ్ గుణ నాయక్‌కు గాయాలయ్యాయి. అవసరమున్న చోట విద్యుత్ స్తంభాల్ని ఏర్పాటు చేయాలనుకుంటే తనపై దాడి చేశారని సర్పంచ్ పోలీసులకు […]

6 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తి.. గుజరాత్‌లో 68 లక్షల ఓటర్ల తొలగింపు

ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయింది. ఆ వివరాలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కంటే గుజరాత్‌లో అత్యధికంగా ఓటర్ల తొలగింపు చోటుచేసుకుంది. రికార్డు స్థాయిలో 68 లక్షల 12 వేల 711 మందిని జాబితా నుంచి తొలగించింది. ఎస్ఐర్ ప్రక్రియకు ముందు 5,08,43,436 మంది ఓటర్లు ఉండగా అది ప్రస్తుతం 4,40,30,725కు తగ్గింది.

సమిష్టి కృషి వల్లే పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది: సిఎం రేవంత్

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్నెళ్ల తర్వాత జరిగిన ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబంలో 3 తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి సొంత ఇళ్లు కూడా లేదని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే కాంగ్రెస్‌ను కనుమరుగు […]

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. అరెస్ట్

కర్ణాటకలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే చంద్రులామని లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ల నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రులామనిని అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటక,గడగ్ జిల్లాలో శనివారం జరిగింది. అరెస్టైన ఎమ్మెల్యే చంద్రులామని షిరాహట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గడగ్ జిల్లాలో నీటి పారుదల శాఖకు సంబంధించి చేపట్టిన ఒక పనికి అనుమతులు ఇచ్చి క్లియరెన్స్ రావాలంటే తనకు రూ.11 లక్షలు చెల్లించాల్సిందే అని […]

నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి :సిఎం చంద్రబాబు

ఎఐ సదస్సులో కాంగ్రెస్ తీరు ఆవవేదన కలిగించిందని, కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని సూచించారు. కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కూడా లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని, లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని తెలిపారు.  తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారని, నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు […]

పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట.. బెయిల్‌ ఇచ్చిన భివాండీ కోర్టు

పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఊరట లభించింది. మహారాష్ట్ర లోని భివాండీ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 2014లో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆరెస్సెస్‌ కేసు వేసింది. మహారాష్ట్రలోని భివాండీ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఇవాళ జరిగిన విచారణకు రాహుల్‌గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.

దేశానికి మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలి: చంద్రబాబు

వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని సిఎం చంద్రబాబు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని.. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో పాల్గొంటానని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలని,  దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు.

గుంతకల్లులో టీడీపీ నేత దౌర్జన్యం.. సోలార్ ఉద్యోగిపై దాడి

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. గుత్తి మండలం బేతాపల్లిలో టీడీపీ నేత రవితేజ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ, ఆ ఇసుకను కొనుగోలు చేయాలని స్థానిక సోలార్ కంపెనీ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఒక్కో టిప్పర్ ఇసుకను ఏకంగా రూ. 24,000కు కొనుగోలు చేయాలని హుకుం జారీ చేశారు. అయితే, ఇంత భారీ మొత్తానికి ఇసుకను కొనేందుకు సదరు సోలార్ ఉద్యోగి నిరాకరించడంతో, ఆగ్రహం చెందిన రవితేజ, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడికి […]

జోడోలో రాహుల్‌తో ఉన్న వ్యక్తి పనే ఇది.. పాత ఫోటో విడుదల చేసిన బీజేపీ

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు శుక్రవారంనాడు వీరంగం చేయడం, చొక్కాలు విప్పి నిరసన తెలపడం ఆ పార్టీని వివాదంలోకి నెట్టింది. అయితే ఈ చర్యను కేంద్ర మంత్రులతో సహా బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌జోడో యాత్రలో రాహుల్‌తో కనిపించిన వ్యక్తే ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసినట్టు బీజేపీ నేత అమిత్‌ మాలవీయ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక ఫోటోను […]

సీఎం స్టాలిన్‌తో మాజీ సీఎం ఓపీఎస్‌ భేటీ..!

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, AIADMK వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ సమన్వయకర్త O. పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి M.K. స్టాలిన్‌ను స్వయంగా కలుసుకుని మాట్లాడారు. అసెంబ్లీలో స్టాలిన్ పాలన బాగుంది అంటూ పన్నీ్ర్ సెల్వం ప్రశంసలు కురింపించారు స్టాలిన్-ఓపీఎస్ సమావేశం తర్వాత, ఓపీఎస్ డీఎంకే పార్టీలో చేరబోతున్నారా అనే ప్రశ్న తలెత్తింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON