loader

మూడు నెలల్లో కొత్తం సీఎం..కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!

కర్ణాటక సీఎం సీటుపై గత కొంత కాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. సీఎంగా డిప్యూటీ సీఎం డేకె శివకుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుతూనే ఉంది. ఈక్రమంలో మరో రెండు, మూడు నెలల్లో డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు దక్కే అవకాశం ఉందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వాఖ్యలు దీనికి మరింత ఆజ్యం పోయడంతో పాటు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు .. అమిత్ షాను ప్ర‌శ్నించిన కేటీఆర్

తెలంగాణలోని రేవంత్ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా..? అని అమిత్ షాను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో.. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంపై విచారణ జరపడానికి కేంద్రానికి ఏం అడ్డు వస్తుందో తెలంగాణ ప్రజలకు వివరించగల‌రా..? అని అడిగారు.

మధుసూధనా చారి, బాల్క సుమన్‌పై కేసు నమోదు

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, మాజీ ఎంపి బాల్కసుమన్‌తో సహ పలువురిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఓ మీడియా చానల్‌పై దాడి చేశారంటూ బిఆర్‌ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌కు వెళ్లారు. తెలంగాణ భవన్‌లోకి వెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారని మధుసూధనాచారి, బాల్కసుమన్‌తో సహా మరికొందరిపై బంజారా హిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్.!

టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సుమారుగా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరు అయినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టి.. విదేళాల్లో ఎమ్మెల్యేలు ఉండటంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సమావేశానికి ఆహ్వానించిన వారిలో 56మంది గైర్హాజరు కావటంపైనా చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు.

ఆమరణ దీక్ష చేస్తా.. దువ్వాడ వాణి

దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమరణ దీక్ష చేస్తానంటూ దువ్వాడ వాణి సంచలన ప్రకటన చేశారు. టెక్కలి మండలంతో పాటుగా చాలా చోట్ల సర్పంచ్‌లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. టెక్కలి మేజర్‌ పంచాయతీలో పారిశుద్ధ్యం దారుణంగా ఉందని.. మౌలిక వసతుల నిర్వహణ దిగజారిపోయిందని దువ్వాడ వాణి తెలిపారు. అధికారులు ఈ నిర్లక్ష్యం వీడేంతవరకు టెక్కలిలో ఆమరణ దీక్ష చేపడతానని దువ్వాడ వాణి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలనలో తొలి అడుగు.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ అధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ” పేరుతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకోవాలనీ, పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

తాడిపత్రిలో ఉద్రిక్తత; మాజీ ఎమ్మెల్యే అరెస్ట్!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రావడం. ఆయన్ని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడాదికాలంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రానివ్వకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డి హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నప్పటికీ శాంతిభద్రతల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తూ వస్తున్నారు.

‘అన్నపూర్ణ’ క్యాంటీన్ పేరు మార్పు.. కేటీఆర్ ఫైర్

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 భోజనం పథకం అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ‘ఇందిరా క్యాంటీన్’గా మార్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రంగా స్పందించారు. మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని కేటీఆర్ మండిపడ్డారు. దిల్లీ పెద్దల ముందు మంచి మార్కులు కొట్టేయడానికి ఇలా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. అంత అవసరం ఉంటే మీ పేరు మార్చుకోవచ్చు కదా, రేవంత్ రెడ్డి తన పేరును మార్చుకుని ‘రాజీవ్’ లేదా ‘జవహర్’ అని పెట్టుకుంటే బాగుంటుందని కేటీఆర్ […]

TPCC క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన కొండా మురళి..

వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరై, తనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చారు. కొండా మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈ కొత్త కాంట్రావర్శీకి కారణమయ్యాయి. కొండా దంపతులైన కొండా మురళి, కొండా సురేఖ.. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారనీ, స్థానిక నాయకులను అణచివేస్తున్నారని.. అసంతృప్త నేతలు ఆరోపిస్తూ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు.

వారందరికీ KTR వార్నింగ్‌! చట్టపరమైన చర్యలు తప్పవంటూ..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్‌ ఇచ్చారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. “కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు, కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతాం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON