loader

రైతుకు నేరుగా రూ.20 వేల భరోసా ఇవ్వండి: షర్మిల డిమాండ్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. “అన్నదాత సుఖీభవ” పథకాన్ని “అన్నదాత దుఃఖీభవ”గా మార్చారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  “సూపర్ సిక్స్” హామీలు అందరికీ వర్తించవు, కేవలం కొంతమందికే వర్తిస్తాయని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉండగా, కేవలం 47 లక్షల మందినే ఎంపిక చేశారని తెలిపారు.  30 లక్షల మంది రైతులను పథకం […]

అత్యాచార కేసులో దోషిగా మాజీ ఎంపీ..

బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రెవణ్ణను హాసన్ జిల్లాలోని హొళెనరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన అత్యాచార కేసులో దోషిగా నిర్ధారించింది. హాసన్‌లోని కుటుంబానికి చెందిన గణ్ణికెర ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న 48 ఏళ్ల మహిళపై రెండుసార్లు అత్యాచారం జరిగిందని ఆరోపించారు. ఒకసారి ఫామ్‌హౌస్‌లో, ఆపై 2021లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో బెంగళూరులోని బసవనగుడిలోని తన ఇంట్లో జరిగిందని ఆరోపించారు. విచారణ చేపట్టిన న్యాయ స్థానం తాజాగా ప్రజ్వల్ ను దోషిగా […]

నా దగ్గర వేల కోట్లు ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్

నా ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం. సీఎం చంద్రబాబు నాయుడు కు లేఖ రాయడానికి కూడా సిద్ధమే. నా దగ్గర వేల కోట్లు ఉన్నాయని నిరూపిస్తే..అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు నా ఆస్తుల్లో రూపాయి పెరిగినా విచారణకు సిద్ధమే. సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్దం’అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

నాకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్న టెలికాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన వారిని నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేశారు. “నా దృష్టిలో కార్యకర్తలే పార్టీకి పునాది, వారిని గౌరవించడమే మా కర్తవ్యం” అని ఆయన పేర్కొన్నారు.

నారా లోకేశ్ వ్యాఖ్య‌ల‌పై సీఎం ఎందుకు నోరు మెద‌ప‌డం లేదు..? రేవంత్‌కు హ‌రీశ్‌రావు సూటి ప్ర‌శ్న

బ‌న‌క‌చ‌ర్ల‌పై నారా లోకేశ్, రేవంత్ రెడ్డి బ‌లం చూసుకొని మాట్లాడుతున్నాడు. బీజేపీ మా చేతుల్లో ఉంది.. మేం ఏం చెప్తే ఆది చేస్తార‌ని ధైర్యంతో.. ఆడిండే ఆట.. పాడిందే పాట అనే ఒక ధైర్యంతో మాట్లాడుతున్నారు. లోకేశ్ బ‌న‌క‌చ‌ర్ల‌ ప్రాజెక్టు క‌ట్టి తీరుతాం అనుమ‌తులు తెచ్చి తీరుతాం అని మాట్లాడితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎందుకు స్పందించ‌డం లేదు. సీఎం రేవంత్ రెడ్డి,  ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఎవ‌రూ మాట్లాడ‌రు ఖండించ‌రు. దీన్ని బ‌ట్టి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ […]

అది మోదీకి తప్ప అందరికీ తెలుసు.. రాహుల్ సంచలన కామెంట్స్

భారత్‌పై 25శాతం సుంకాలు విధిస్తూ అమెరికా ప్రెసిడెంట్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇండియా ఆర్థికవ్యవస్థ చచ్చిపోయిందని ఆరోపించారు. ట్రంప్ అన్నది కరెక్టేనని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్.. రష్యాతో ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నా నాకు అవసరం లేదు. ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మొత్తం కూల్చేసుకున్నా నాకు పట్టింపు లేదని ట్రంప్ అన్నారు. ఈ విషయం ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లకు తప్ప ప్రపంచంలోని అందరికీ తెలుసన్నారు. ట్రంప్ ఈ […]

కాళేశ్వరం కట్టినప్పుడు అనుమతులు ఉన్నాయా- నారా లోకేష్

బనకచర్ల అంశంపై తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు.. దాన్నో రాజకీయ అంశంగా చేసుకుంటున్నారని నారా లోకేష్ విమర్శించారు. దిగువ రాష్ట్రం.. సముద్రంలోకి పోయే నీళ్లను మళ్లించుకుంటే ఎందుకు వివాదం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్టు కడితే ఎగువ రాష్ట్రానికి ఎలా నష్టం జరుగుతుందని ప్రశ్నించారు.

స్టాలిన్‌తో మార్నింగ్ వాక్.. కాసేపటికే ఎన్డీఏకు గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు ప్రకటించారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓపీఎస్.. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో మార్నింగ్ వాక్‌ సందర్భంగా సమావేశమైన కొద్ది గంటల్లోనే పన్నీర్ సెల్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబుకు భయమెందుకు ? : వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. తన పర్యటనకు వేలాదిమంది పోలీసులను మోహరించి తన అభిమానులను అడ్డుకోవడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. తన పర్యటనను అడ్డుకోవడానికి అనేక ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందని సూపర్‌సిక్స్‌ హామీల గురించి ప్రశ్నించే గొంతులను నొక్కెస్తున్నారని దుయ్యబట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON