loader

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు  అవతరించిన పవిత్ర దినం ఇదని అన్నారు. ఆయన చూపిన నీతి మార్గంలో నడుస్తూ, ప్రతి ఒక్కరూ తమ జీవితాలను ఆనందం, సంతోషాలతో నింపుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.

తెలంగాణ కాంగ్రెస్‌లోనూ బీజేపీ కోవర్టులు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పార్టీలోనూ ఒకరు, ఇద్దరు కోవర్టులు ఉంటారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీ కోవర్టులు ఉన్నారన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ ఇస్తామంటే స్క్రిప్ట్ చదువుతూ ఉంటారని ఆరోపించారు. రాజకీయాల్లో కోవర్ట్‌ వ్యూహం ఎప్పటి నుంచో ఉందన్నారు జగ్గారెడ్డి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే జగ్గా రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ గణేశన్(80) కన్నుమూశారు. ఈ నెల 8న తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా, ఫలితం లేకపోయింది. ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గణేశన్ ఒక నిష్ఠమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీగా వంటి పలు కీలక పదవులను నిర్వర్తించారు.

బీజేపీలో చేరిన ఫైర్ బ్రాండ్ కస్తూరి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

ప్రముఖ తమిళ నటి కస్తూరి బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ట్రాన్స్‌జెండర్ కార్యకర్త, నామిస్‌ సౌత్‌ క్వీన్‌ ఇండియా అధ్యక్షురాలు నమిత మారిముత్తు కూడా బీజేపీలో చేరారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కస్తూరి గత కొన్ని రోజులుగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.

డ్రైవర్‌గా హిందూపురం ఎమ్మెల్యే

నందమూరి బాలకృష్ణ.. సినిమా, రాజకీయాలు రెండింటినూ సమయం, సందర్భం దొరికినప్పుడల్లా తన ప్రత్యేకను చాటుకుంటూనే ఉన్నారు. మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూపురం బస్టాండ్ నుంచి బాలయ్య క్యాంప్ ఆఫీస్ వరకూ ఆర్టీసీ బస్సును డ్రైవింగ్ చేశారు. బస్సులో మహిళా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుని ఏకంగా రెండు కిలోమీటర్ల మేర బస్సు నడిపిన బాలయ్య.. తన ట్యాలెంట్‌ను చాటుకున్నారు.

అసెంబ్లీలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ

ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది.ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి ముందుకు వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ‘విజన్ 2047’ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార పార్టీ తరపున ఎవరు మాట్లాడాలో నిర్ణయించే సమయంలో వారణాసి బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవతో మథుర బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ చౌదరి […]

ఓట్ చోరీ క్యాండిల్ ర్యాలీలో షర్మిల ఫైర్

ఓట్ చోరీ ఆరోపణల నేపథ్యంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. దొంగ ఓట్లతో నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఓట్లు చోరీ విషయంలో ప్రధాని మోడీనే అసలు గజ దొంగ అని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ లైన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్ జగన్ అనడం హాస్యాస్పదంగా ఉంది అని , జగన్ తన పార్టీలో అరెస్ట్ అయిన నేతలను చూడటానికి వెళ్లి తలకాయలు తొక్కించేసినట్టుగా రాహుల్ గాంధీ […]

వోట్ చోరీ చెత్త పదం, అలా అనే బదులు సాక్ష్యాలు ఇవ్వండి: రాహుల్ గాంధీపై ఈసీ ఫైర్

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ‘ఓట్ల దొంగతనం’ ప్రచారంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీతో ఈసీ కుమ్మక్కు అయిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.ఓట్ చోరీ అనే బదులు అందుకు సరైన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. మహాదేవపురంలో ఓట్ల అవకతవకలు జరిగాయని రాహుల్ ఆరోపించగా.. ఈసీ ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఓట్ల దొంగతనం’ అనే పదం ఎన్నికల ప్రక్రియపై దాడి చేయడమేనని ఈసీ పేర్కొంది.

టీడీపీ హవా.. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలోనూ గెలుపు

ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి 6267 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 12708 ఓట్లు రాగా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6513 ఓట్లు వచ్చాయి.. మిగిలిన ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి 6267 ఓట్ల మెజార్టీ వచ్చిందని ప్రకటించారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు.

ఆ పనిచేయకపోతే నేనే ధర్నా చేస్తా.. టీడీపీ ఎమ్మెల్యే డెడ్‌లైన్

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి నూజివీడు వెళ్లే రహదారి అభివృద్ధి పనుల టెండర్లను 48 గంటల్లో పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. 48 గంటలు డెడ్‌లైన్ విధించారు.. లేకపోతే ధర్నాకు కూర్చుంటాను అంటూ హెచ్చరించారు. రహదారి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, రోడ్లు భవనాలశాఖకు చెందిన అధికారి టెండర్లు పిలవకుండా ఆలస్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON