కవిత కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు – తీన్మార్ మల్లన్న
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేతులు కలిపి, కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి మాజీ ఎమ్మెల్సీ కవిత వచ్చారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడగా, రాహుల్ గాంధీ అడ్డు చెప్పారని ఆయన తెలిపారు. కవిత పార్టీ మారే విషయం తెలిసి కేసీఆర్ ఆమెను పక్కకు పెట్టారని మల్లన్న ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

