ఎన్నికల సమయం లోనే ఉగ్రదాడులా ?: సిద్ధరామయ్య
దేశంలో ఎన్నికల సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడానికి కారణాలేమిటని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య సందేహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్షం బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా సిఎం సిద్ధరామయ్య ఎన్నికల సమయం లోనే ఉగ్రమూకల దాడులు జరగడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. మంగళవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్పూర్తయిన తరువాత సిద్ధరామయ్య వ్యాఖ్యలు వచ్చాయి. దేశంలో బాంబు పేలుళ్లు జరగకూడదని, అమాయక ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు

