loader

‘మకుటం’ డైరెక్టర్‌తో గొడవలు.. హీరో విశాల్ కీలక ప్రకటన..

కోలీవుడ్ హీరో విశాల్ ‘మకుటం’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. రవి అరసు దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే దర్శకుడితో వచ్చిన విభేదాలు కారణంగా విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదంటూ దీపావళి సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. దీపావళి సందర్భంగా విశాల్ ఎక్స్ లో పోస్ట్ పెడుతూ.. ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ, ‘మకుటం’ […]

భార‌తీయ సినీ చిత్ర ప్ర‌ముఖ న‌టుడు గోవ‌ర్ధ‌న్ అస్రానీ క‌న్న‌మూత‌..!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ న‌టుడు, క‌మెడియ‌న్ గోవింద్ అస్రాని (84) తుదిశ్వాస విడిచారు. షోలే చిత్రంలో జైల‌ర్ పాత్రతో గుర్తింపు పొందిన న‌టుడు సోమ‌వారం క‌న్నుమూశారు. ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయ‌న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌న్నుమూశారు. 1964లో అస్రానీ పుణేలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్ష‌ణ పొందారు. అస్రానీ ‘హరే కాంచ్ కి చురియాన్’ చిత్రంలో తన తొలి అవకాశాన్ని పొందాడు.1971 సంవత్సరం తర్వాత.. అస్రానీ సినిమాల్లో క‌మెడియ‌న్‌గా.. నటుడి స్నేహితుడి పాత్ర‌ల్లో […]

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. కానీ ఓ చిన్న రిక్వెస్ట్‌: రేణు దేశాయ్

రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..’ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకునే సమయమని నాకు కూడా తెలుసు. కానీ రాత్రి 9 గంటల తర్వాత చాలా ఎక్కువుగా శబ్ధం వచ్చే క్రాకర్లు పేల్చకండి.  చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు ఆ విపరీతమైన శబ్దాలకు ప్రభావితమవుతారు. ఈ సమయంలో మీరు చాలా మెరుపులు, పూల కుండలు, చక్రాలతో ఆనందించండి. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్‌తో పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి’ […]

ఏపీలో కళాకారులకు.. త్వరలోనే ప్రత్యేక పింఛన్లు!

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలను పరిరక్షించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కళారూపాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో సాంస్కృతిక, కళారంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే కళాకారుల కృషిని గౌరవిస్తూ, వారికి అందరితోపాటు కాకుండా ప్రత్యేక పింఛన్ అందించే విధానాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

అవార్డులనేవి చెత్త విషయం…నాకొస్తే చెత్తబుట్టలో పడేస్తా: విశాల్ కాంట్రవర్సీ

విశాల్ తన పోడ్‌కాస్ట్ లో అవార్డుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “అవార్డులు కేవలం కమీటీ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. 8 కోట్ల మంది లేదా 80 కోట్ల మంది ఇష్టపడే సినిమాకి అవార్డు ఇవ్వాల వద్దా అనేది కేవలం 8మంది సభ్యులు నిర్ణయించడం సరైన విధానం కాదు. ఇది నేషనల్ అవార్డులకు సైతం వర్తిస్తుంది. నావరకు నేను అవార్డుల్ని నమ్మను. ఎవరైనా నాకు అవార్డు ఇస్తే దాన్ని చెత్తబుట్టలో పడేస్తాను’ అని చెప్పుకొచ్చారు.

5000.. మరో బిడ్డకు ప్రాణం పోసిన సూపర్ స్టార్ ..

మహేష్ బాబు కు కోట్లాది మంది అభిమానులుండడానికి కారణం కేవలం సినిమాలే కాదు. ఆయన చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో అందులో ప్రధానంగా గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం అలా ఇప్పటివరకు వేలమంది చిన్నారులకు ఉచితంగా హార్ద్ సర్జరీలు చేయించాడీ రియల్ హీరో నేటితో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం 5000 ఉచిత హార్ట్ సర్జరీలు పూర్తయ్యాయట. సోషల్ మీడియాలో మహేష్ పై ప్రశంసల వర్షం […]

ద‌గ్గుబాటి ఫ్యామిలీకి నాంప‌ల్లి కోర్టు స‌మ‌న్లు..

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదానికి సంబంధించిన కేసులో ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నేడు విచార‌ణ‌కు రాగా.. దీనిపై విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం నవంబర్ 14న జరగబోయే త‌దుప‌రి విచారణకు దగ్గుబాటి వెంకటేశ్‌తో పాటు, రానా, అభిరామ్, సురేశ్‌ బాబు తప్పనిసరిగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడానికి కచ్చితంగా నలుగురూ కోర్టుకు రావాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది.

తొలి తెలుగు సినీ నేపథ్యగాయని రావు బాలసరస్వతి దేవి ఇక లేరు

తెలుగు సినీ సంగీత రంగంలో తీవ్ర విషాదం. టాలీవుడ్ తొలి నేపథ్య గాయనుల్లో ఒకరైన రావు బాలసరస్వతీ దేవి కన్నుమూశారు. 97 ఏళ్ల వయస్సులో పలు అనారోగ్య కారణాల వల్ల ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో స్వగృహంలో ఆమె మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పాటలతో ఆమె పేరు సంపాదించారు. మొత్తం 2000కి పైగా పాటలు ఆమె ఆలపించారు.

నలభయేళ్ల తర్వాత షాక్ ఇచ్చిన ఎంటీవీ .. మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌

నలభయేళ్లుగా సంగీత ప్రియులను అలరిస్తూ ఉన్న ఎమ్‌టీవీ పారామౌంట్‌ గ్లోబల్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 31 తర్వాత తమ అనుబంధ సంగీత ఛానళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో ‘ఎమ్‌టీవీ మ్యూజిక్‌’, ‘ఎమ్‌టీవీ 80స్‌’, ‘ఎమ్‌టీవీ 90స్‌’, ‘క్లబ్‌ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ లైవ్‌’  ఛానళ్లు ఉన్నాయి.ఎమ్‌టీవీ ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా స్మార్ట్‌ఫోన్లు విస్తారంగా వాడ‌డం, యూట్యూబ్‌, టిక్‌టాక్‌, స్పాటిఫై వంటి మ్యూజిక్ యాప్స్‌కు ప్రేక్షకుల ఆద‌ర‌ణ‌ ఎక్కువ కావడం, సంగీతం ప్రసారం చేసే ఛానళ్లకు ఆదరణ తగ్గిపోవడం […]

బాలీవుడ్‌ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025.. ఉత్త‌మ చిత్రంగా ‘లాపతా లేడీస్’

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే 70వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2025 వేడుక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ చిత్రం అత్యధిక అవార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది. ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ‘చందు ఛాంపియన్’ చిత్రానికి కార్తీక్ ఆర్యన్, ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రానికి అభిషేక్ బచ్చన్ సంయుక్తంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON