loader

గౌరీ కిషన్‌ బాడీ షేమింగ్ ప్రశ్నపై నటి ఖుష్బూ ఆగ్రహం!

మ‌ల‌యాళ న‌టి గౌరీ కిష‌న్‌ను ఒక రిపోర్ట‌ర్ బాడీ షేమింగ్ చేసిన  ఒక రిపోర్ట‌ర్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జర్నలిజం తన విలువను కోల్పోయింది. ఈ సోకాల్డ్ జర్నలిస్టులు జర్నలిజాన్ని పాతాళానికి తీసుకుపోతున్నారు. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది వారి పని కాదు. దీని గురించి హీరోను అడగడం ఏంటి? ఎంత సిగ్గుచేటు! అని ఖుష్బూ మండిపడ్డారు. ఇలాంటి ప్రశ్న‌కి తన స్థానంలో గట్టిగా నిలబడి, దీటుగా సమాధానం చెప్పిన గౌరీ కిష‌న్‌కి నా ధ‌న్య‌వాదాలు […]

నావల్ల కావట్లేదు.!.. సీపీ సజ్జనార్ ను ఆశ్రయించిన సింగర్ చిన్మయి..

“మంగళసూత్రం ధరించాలా? వద్దా? అనేది పూర్తిగా తన భార్య చిన్మయి నిర్ణ‌యం” దీనిపై పెద్ద వివాదం రాజుకుంది. సింగర్ చిన్మయి దంపతుల్ని ఒక రేంజ్ లో నెటిజన్లు ఏకీపారేశారు. ఈసారి ట్రోలర్స్ తన పిల్లలను కూడా ట్రోలింగ్‌లోకి లాగి, వారు చనిపోవాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించడంతో చిన్మయి దంపతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. దీనిపై ఏకంగా సీపీ సజ్జనార్ ను సోషల్ మీడియాలో గాయని ట్విట్ చేసి తన మనో వేదనను తెలియజేశారు. అదే విధంగా ఫిర్యాదు కూడా చేశారు.

కేజీఎఫ్ చాచా ఫేమ్ హరీష్ రాయ్ కన్నుమూత

కేజీఎఫ్ ఫేమ్ సీనియర్ నటుడు హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. 90వ దశకం నుంచి యాక్టివ్‌గా ఉన్న ఆయన,నల్ల, ఓం, కేజీఎఫ్ సహా పలు హిట్ చిత్రాల్లో విలన్‌గా నటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు చిత్ర పరిశ్రమ ఆర్థిక సహాయం అందించింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో మరణించారు. హరీష్ రాయ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

‘జ్యూరీ కళ్లు మూసుకుందా..?’ప్రకాష్ రాజ్‌పై బాలనటి షాకింగ్ కామెంట్

ఓ 12 ఏళ్ల బాల నటి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు విజేతలను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుడిగా ఉన్న ప్రకాష్ రాజ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది… ‘పిల్లల విషయంలో మీ కళ్లు మూసుకుపోయాయి. కానీ అంతా చీకటిగా ఉందని మాత్రం చెప్పకండి. ఈ సోసైటీలో పిల్లలు కూడా భాగమే.. 2024 మలయాళం ఫిల్మ్ అవార్డుల విషయంలో భవిష్యత్ తరాలకు చెందిన పిల్లల విషయంలో జ్యూరీ, పూర్తిగా కళ్లు మూసుకుపోయినట్టుగా వ్యవహరించింది..’ అంటూ రాసుకొచ్చింది దేవనంద జిబిన్..

మంగళసూత్రం వేసుకుంటే అత్యాచారాలు ఆగిపోతాయా- నెటిజన్‌కి చిన్మయి కౌంటర్

ఈ రోజుల్లో మహిళలకు వివాహం అయిందా లేదా అని తెలియజేసేందుకు ఒక గుర్తుగా మంగళసూత్రం వారికి అదనపు భద్రతని కల్పిస్తుంది. దాన్ని వివక్షగా భావించకండి. అని ట్వీట్ చేశాడు. అతడి కామెంట్స్‌పై చిన్మయి ఘాటుగా స్పందించింది. ‘ మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించేవరకు ఈ సమాజంలో మహిళలకు ఏ దశలోనూ భద్రత లేదు. చాలాచోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటూ చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

మళ్ళీ దుమారం రేపిన బండ్ల గణేష్ లేటెస్ట్ స్పీచ్..

ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్స్ అప్.. వాట్స్ అప్ ..ఏం కావాలి..ఏంటి… అని మాట్లాడి, అర్థరాత్రి కూడా కళ్లద్దాలు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని కూర్చునే ఈ రోజుల్లో, హిట్టు మీద హిట్టు కొడుతూ మన ఇంట్లో కుర్రాడిలా ఉండే కిరణ్ అబ్బవరం అంటూ కామెంట్ చేసాడు, బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ విజయ్ దేవరకొండ గురించా అని సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తుంది.

జానీ మాస్టర్‌కు…. సింగర్ చిన్మయి సంచలన ట్వీట్..

సింగర్ చిన్మయి ఒక సంచలన ట్వీట్ పెట్టింది. జానీతో పాటు మరో ప్రముఖ సింగర్ కార్తీక్ పై కూడా తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు ఛాన్సులు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే అవుతుంది. అధికారం, ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టవద్దు. మన నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది తప్పకుండా […]

బ‌ర్త్‌డే ట్రీట్.. షారుఖ్ ఖాన్ ‘కింగ్’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కింగ్’కు సంబంధించిన అప్‌డేట్ విడుదలైంది. అభిమానులకు బర్త్‌డే ట్రీట్‌గా.. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి టైటిల్ గ్లింప్స్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ప‌ఠాన్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుంది. ఈ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఐశ్వర్య రాయ్

ఐశ్వర్య రాయ్ (జననం 1 నవంబరు 1973), ప్రముఖ భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి. 1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారామె. ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ లలోనూ నటించారు. ఫిలింఫేర్ పురస్కారాల నామినేషన్ తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఐశ్వర్య. 2009లోభారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రపంచంలోని అత్యంత అందమైనవారిలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటుంటారు

ఘనంగా అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం..

కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. నయనిక రెడ్డి హైదరాబాద్ కి చెందిన అమ్మాయే. ఆమె బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరికి చాలా రోజులనుంచి పరిచయం ఉండడం, అది ప్రేమగా మారడం జరిగింది. ఈ వేడుకకి అల్లు ఫ్యామిలీతో పాటు.. చిరంజీవి సురేఖ దంపతులు, రాంచరణ్ ఉపాసన దంపతులు, నాగబాబు పద్మజ దంపతులు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON