
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన స్థలానికి మంగళవారం రాత్రి ర్యాట్ మైనర్స్ ఎన్డీఆర్ఎఫ్, ఎల్అండ్టీ బృందాలు చేరుకొని అక్కడి దృశ్యాలను చిత్రీకరించాయి. అక్కడ చుట్టూ ఉన్న లైనింగ్ ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, మేఘాకు చెందిన నిపుణులు కూడా లోపలికి వెళ్లి టన్నెల్లో బురద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టలేమని టన్నెల్లోని పరిస్థితిని వీడియో చేసి పోస్టుచేశారు.