సూడాన్ లోని వెస్ట్ కోర్టోఫాన్ ప్రాంతంలో బంగారు గని కుప్పకూలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటివరకు 82కు చేరింది. అధునాతన యంత్రాలు లేకపోవడం మరియు శిథిలాలు భారీగా పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గనిలో ఇంకా అనేకమంది చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నుండి గనిలో వరుసగా మట్టిపెళ్లలు విరిగిపడటంతో ప్రమాదం తీవ్ర రూపం దాల్చింది.