తెలంగాణ భాష, యాసలోని పదును, ప్రత్యేకతను తన రచనల ద్వారా చాటిచెప్పిన ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జరుపుకునే తెలంగాణ భాషా దినోత్సవం మనందరికీ ఎంతో ప్రత్యేకమైనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల భాషలోనే ప్రజల సమస్యలను, ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించిన కాళోజీ, తన కలాన్ని సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచారని ప్రశంసించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.