తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. అన్యాయాన్ని ఎదిరించడమే తన గొడవని కాళోజీ నిక్కచ్చిగా ప్రకటించారు. ప్రజల పక్షాన నిలబడి సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యలపై ఆయన ఈ కవిత్వాన్ని అస్త్రంగా మలచారు. “పుట్టుక నీది, చావు నీది – బ్రతుకంతా దేశానిది” అనే ప్రసిద్ధ స్పూర్తిదాయక భావన ఆయన కవిత్వ తత్వానికి నిదర్శనం.