ఛత్తీస్గఢ్లో భారీ ఎత్తున్న మావోయిస్టుల డంప్లను భద్రతా బలగాలను స్వాధీనం చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన 14 డంప్లను భద్రతా బలగాలు గుర్తించి, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఆర్పిఎఫ్ అధికారులు సోమవారంనాడు వెల్లడించారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు మావోయిస్టులు గతంలో దాచిపెట్టినట్లు భావిస్తున్న ఈ సామగ్రిలో పలు రకాల రైఫిళ్లు, డిటోనేటర్లు, ఐఈడీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.