కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమ ఎజెండా అమలుపై సమగ్ర సమీక్షకు సిద్ధమైంది. వివిధ కీలక రంగాల్లో ప్రభుత్వ పనితీరు, ప్రధాన సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి ఫలితాలను అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. కేవలం సాధారణ శాఖల సమీక్షగానే కాకుండా, వ్యక్తిగతంగా ఆయా శాఖల మంత్రులు, సహాయ మంత్రుల పనితీరును కూడా ప్రధాని నిశితంగా పరిశీలించనున్నారు.