రాష్ట్రంలో విద్యారంగ రూపురేఖలను మార్చేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, విద్యాశాఖలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని, తనకు రెండేళ్ల సమయం ఇస్తే అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. టీచర్ల బదిలీల విషయంలోనూ ఎక్కడా ఎలాంటి లోపాలు, అభ్యంతరాలకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు.