ఐఎండీ సెప్టెంబర్ నెలకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. ఇందులో సెప్టెంబర్ మొదటి వారం పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని, రెండో వారంలో అక్కడక్కడా జల్లుకు కురిసే అవకాశం ఉందని, ఆ తర్వాత మాత్రం ఇక వర్షాలు మర్చిపోవచ్చని అమరావతి వాతావరణ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్త కరుణాసాగర్ ద హిందూకు వెల్లడించారు. ఈ పరిస్ధితులు కచ్చితంగా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అలాగే భూగర్భ జలాలు కూడా భారీగా పడిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు.