బలోచిస్తాన్ హోం మంత్రి మీర్ జియావుల్లా లాంగౌ కాన్వాయ్పై దాడి జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈ దాడి నుంచి హోం మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. కలత్ నుంచి క్వెట్టా వెళ్తున్న ఈ కాన్వాయ్ను మస్తుంగ్ జిల్లాలోని ఖద్కోచా గోరు సమీపంలో సాయుధులు లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. కాల్పుల్లో నలుగురు ఎటిఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే షాహీద్ నవాబ్ గౌస్ బక్ష్ రైసాని ఆసుపత్రికి తరలించారు.