మహారాష్ట్రలోని నాందేడ్లో శిరోమణి అకాలీ దళ్ జాతీయ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి గురుద్వారా మాతా సాహిబ్ కౌర్లో పూజలు చేసేందుకు వెళ్లిన సమయంలో , ఓ నిహంగ్ సిక్కు కిర్పాన్తో బాదల్పై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాదల్ భద్రతా సిబ్బంది కూడా అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాడిలో బాదల్ చేతికి గాయమైంది. దాడి జరిగిన వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.