సినిమా షూటింగ్లో ప్రమాదవశాత్తు గాయపడిన ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంపై సికింద్రాబాద్లోని KIMS ఆసుపత్రి వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.డాక్టర్ పూర్ణచంద్ర నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో కోలుకొని, సాధారణ స్థితికి చేరుకోవడానికి 2 నుండి 3 నెలల సమయం పడుతుందని హెల్త్ బులెటిన్లో స్పష్టం చేశారు.