ఘట్టమనేని మహేశ్ బాబు (1975 ఆగస్టు 9) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు.
బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా ఉత్తమ నటుడు పురస్కారం కింద నంది అవార్డును అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు.