థాయ్లాండ్లోని బాగ్ క్రువాయ్ జిల్లాలోని డెబ్సిరిన్ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులపై అతడి తాతకు చెందిన 9 ఎంఎం హ్యాండ్గన్ తో కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన విద్యార్థి కూడా తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.స్కూల్లో కాల్పులు జరపడానికి ముందే సదరు విద్యార్థి ఇంట్లో అతడి బామ్మ, తాతలను కాల్చి చేసినట్లు థాయ్లాండ్ మంత్రి తెలిపారు.