రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల పంపకం సరిగా జరగలేదని అన్నారు.. 2019 తర్వాత వైసీపీ హయాంలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం రాగానే బ్రాండ్ ఏపీని పునరుద్ధరించాముని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం 2025-26లో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారు చేసిందని సీఎం వివరించారు. అటు వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నామని అన్నారు.