ఉత్తర్ప్రదేశ్లోని కైస్రంగజ్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు అయిన బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఒక పెద్ద ఊరటనిచ్చింది.రెజ్లర్ లైంగిక దాడి కేసులో కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. తీర్పు వినడానికి స్వయంగా కోర్టుకు హాజరైన బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ సింగ్, “నేను కోర్టు తీర్పు వినడానికే వచ్చాను. నా చేతుల్లో ఏమీ లేదు” అని అన్నారు.ఈ కేసులో వినోద్ తోమర్ను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.