తెలంగాణ మలిదశ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) ఇకలేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం (జులై 31) రాత్రి 12:51 గంటలకు కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండె ఆగిపోవడం, నాడీ వ్యవస్థ స్పందించకపోవడంతో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.

